నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న పౌర సన్మాన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు డిఐజి ఏ.వి. రంగనాధ్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ స్వాగతం పలికారు.
నల్లగొండ పట్టణంలోని ఆర్ అండ్ బి అతిధి గృహంలో పూల మొక్కలు అందచేసి స్వాగతం పలికారు. అనంతరం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయను మర్యాద పూర్వకంగా కలిసి కొద్దిసేపు ఆయనతో ముచ్చటించారు.
నల్లగొండకు వస్తున్న సందర్భంలో దత్తాత్రేయ వాహనానికి జరిగిన ప్రమాదం వివరాలను తెలుసుకుని ఆయన యోగక్షేమాలను తెలుసుకున్నారు.