రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) సందర్భంగా ఈశ్వరీయ బ్రహ్మకుమారి ప్రతినిధులు ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైఎస్ జగన్ రెడ్డికి రాఖీలు కట్టారు. రాజయోగిని బ్రహ్మకుమారి శాంత దీదీ జీ, సిస్టర్స్ పద్మజ, మానస తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా సెప్టెంబర్లో మౌంట్ అబూలో జరిగే గ్లోబల్ సమ్మిట్కు ముఖ్యమంత్రిని బ్రహ్మకుమారి ప్రతినిధులు ఆహ్వానించారు.
హోంమంత్రి తానేటి వనిత, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, మహిళా కమీషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్రమాని విజయనిర్మల, రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, మహిళా కమిషన్ సభ్యులు కర్రి జయశ్రీ, గెడ్డం ఉమ తదితరులు కూడా ఈశ్వరీయ బ్రహ్మకుమారి ప్రతినిధులతో బాటు ముఖ్యమంత్రికి రాఖీ కట్టారు.