33.2 C
Hyderabad
May 4, 2024 02: 19 AM
Slider విజయనగరం

పోలీసులు జులుంపై విజ‌య‌న‌గ‌రంలో బీజేపీ ఆందోళ‌న‌….!

#vijayanagarambjp

జ‌గ‌న్ ప్ర‌భుత్వం హ‌యాం లో పోలీసులు  ఇష్టా రాజ్యంగా ప‌ని చేస్తున్నార‌ని విజ‌య‌న‌గ‌రం జిల్లా బీజేపీ శాఖ ఆరోపించింది..అనంత‌పురం జిల్లాలో ఎయిడెడ్ క‌ళాశాల విద్యార్ధినీల‌పై తీవ్రంగా దాడి చేయ‌డ‌మే  అందుకు నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొంది.. ఆ దాడిని ఖండిస్తూ…స‌ద‌రు విద్యార్దినీ బంధువుల‌కు క్షమాప‌ణ చెప్పాలంటూ విజ‌య‌న‌గ‌రంలో ఆ పార్టీ జిల్లా అధ్య‌క్షురాలు రెడ్డిపావని ఆధ్వ‌ర్యంలో క‌లెక్ట‌ర్ వ‌ద్ద ధ‌ర్నా చేప‌ట్టింది. బీజేపీ.ఈ సంద‌ర్బఃగా  పోలీసులు జులుం న‌శించాలి…ఖాకీల దౌర్జన్యాన్నిఖండించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసారు.ఈ సంద‌ర్బఃంగా పార్టీ జిల్లా  అధ్య‌క్షురాలు రెడ్డి పావ‌ని మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసులు…న్యాయ అన్యాయాలు చూడ‌కుండా జ‌గ‌న్ ప్ర‌భుత్వానికే కొమ్ము కాస్తున్నార‌ని ఆరోపించారు. ఓ ఎయిడెడ్ క‌ళాశాల విద్యార్దినీ,ఆడ‌పిల్ల అని చూడ‌కుండా నిర్దాక్షిణ్యంగా అనంతపురం పోలీసులు దాడి చేయ‌డం దుర్మార్గ‌పు చ‌ర్య అని రెడ్డి పావ‌ని ధ్వ‌జ‌మెత్తారు. త‌క్ష‌ణం బాధిత విద్యార్ధిని కుటుంబానికి పోలీసులు క్ష‌మాప‌ణ చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది.

Related posts

సైబర్ నేరగాళ్ళనుండి జాగ్రత్త వహించండి

Satyam NEWS

పంచాయితీ ఎన్నికలపై జగన్ ప్రభుత్వ పిటిషన్ కొట్టేసిన సుప్రీం

Satyam NEWS

మంత్రి గంగులకు, సీఎం కేసీఆర్ కు ఈటల హెచ్చరికలు

Satyam NEWS

Leave a Comment