గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ప్రకాష్ నగర్ తిలక్ స్కూల్ లో ప్రభుత్వం పంపిణీ చేసిన కోడిగుడ్లలో పురుగులు,కుళ్ళిపోయిన కోడిగుడ్లు వచ్చాయని విద్యార్థుల తల్లిదండ్రులు సామాజిక మాధ్యమాల్లో వీడియో తీసి పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతున్న నేపథ్యంలో మిడ్డే మీల్స్ శానిటేషన్ డైరెక్టర్ దివాన్ మైథిన్ నరసరావుపేట తిలక్ స్కూల్ కి హుటుహుటిన వచ్చి మధ్యాహ్నం భోజనం, కోడిగుడ్లు స్నాక్స్ ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కోడిగుడ్ల స్నాక్స్ మంచి నాణ్యతతో కూడిన వాటిని పంపిణీ చేస్తున్నారని విద్యార్థులకు మంచి ఆహారం ఏర్పాటు చేస్తున్నారని విద్యార్థిని తల్లి వారి పర్సనల్ కి సంబంధించిన వాటి గురించి స్కూల్లో ఇటువంటి అసత్య ప్రచారం చేశారని అన్నారు.
previous post