శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో చైర్మన్ నాగ రమేష్ ఆధ్వర్యంలో ములుగు జిల్లా కేంద్ర గ్రామ పంచా యతీ కార్యాలయ ఆవరణంలో సోమవారం దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డి ఎల్ పి ఓ దేవరాజు, ములుగు భూపాలపల్లి ఉమ్మడి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లిమ మహమ్మద్, ములుగు గ్రామ పంచా యతీ 5 వ వార్డ్ నెంబర్ మాదం లలితాసాగర్, లు పాల్గొన్నారు.
మొత్తం 30 మంది నిరు పేదలకు చలి తీవ్రత దృష్ట్యా దుప్పట్లను పంపిణీ చేశారు. అదే విధంగా పాలకర్తి రాజు విజయ, యశబోయిన కొమురమ్మ బుచ్చయ్య దంపతులకు 50 కేజీల బియ్యం, ఆర్థిక అందజేశారు. ఈ కార్య క్రమంలో కోడిపాక కట్టయ్య, హుస్సేన్, రామ్ రెడ్డిలు, ట్రస్ట్ సభ్యులు బాడిష నవీన్, ఆదినారాయణ, ఓడ ప్రవీణ్, చిట్యాల రాజశేఖర్, జయరాజ్, ప్రవీణ్, మహేష్, కనుకుంట్ల నాగరాజు, జోసెఫ్, విష్ణు , భూష బోయిన రమేష్ యాదవ్, లు పాల్గొనగా స్థానిక ప్రజలు వారి సేవలను కొనియాడారు మీరు ఇలాంటి సేవలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరగా చైర్మన్ నాగ రమేష్ మాట్లాడుతూ ఎక్కడైనా ఎప్పుడైనా నిరుపేదలకు ఆపదలో ఉన్న వారిని తమ దృష్టికి వచ్చినట్లయితే సాధ్యమైనంత వరకు ఆ భగవంతుని దయవల్ల తాను వీలైనంత వరకు సహాయం చేయుటకు ముందుంటానన్నారు.