నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర నాయకులు వి.సందీప్ యాదవ్ ఆధ్వర్యంలో కాప్రాలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగాకేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు పొలాస రమేష్ పాల్గొన్నారు. నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర విశ్వకర్మ కన్వీనర్ పూసల.బ్రహ్మచారి, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు పాశం నవీన్ యాదవ్, బిజెపి మహిళా మోర్చా నాయకురాలు ఉమా రాణి, ఆర్ఎస్ఎస్ గోపాల్ చారి, బీజేవైఎం డివిజన్ అధ్యక్షులు ఏం. దేవేందర్, బిజెపి డివిజన్ అధికార ప్రతినిధి మిద్దె గోపాల్ గౌడ్, సీనియర్ నాయకులు చంద్రశేఖర్, బిజెపి నాయకులు కే సురేష్, గణేష్, బిజెపి సీనియర్ నాయకులు రాజు, సురేష్, రామచందర్ కార్యకర్తలు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా