29.7 C
Hyderabad
May 6, 2024 03: 07 AM
Slider ముఖ్యంశాలు

వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లకు 31 వరకు గడువు

#agricultural women

మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలల్లో బీఎస్సీ మొదటి సంవత్సరంలో ప్రవేశానికై 2023-24 విద్యా సంవత్సరంలో ఎంసెట్- 2023 ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థినులు ఆన్లైన్ https://mjptbcwreis.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సంస్థ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య బట్టు తెలిపారు.

వనపర్తి, కరీంనగర్ లో ఉన్న మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి గల యువతులు ఈ నెల 31వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఎంసెట్-2023 ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు, రిజర్వేషన్ ప్రాతిపదికన విద్యార్థులను ఎంపిక చేస్తామన్నారు.

సీటు సాధించిన విద్యార్థినీలు కాలేజీ హాస్టల్ లోనే ఉండాలని, డే-స్కాలర్స్ విధానం ఉండదని మల్లయ్య బట్టు స్పష్టం చేశారు.గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.1,50,000, పట్టణ ప్రాంతాల్లో నివసించే వారి వార్షిక ఆదాయం రూ.2,00,000/- మించని విద్యార్థినీలు మాత్రమే అర్హులని తెలిపారు .

Related posts

విజయనగరం జిల్లాలో బయటపడ్డ ఖాకీ లంచం వ్యవహారం….

Satyam NEWS

తీన్మార్ మల్లన్నపై ప్రభుత్వం చేస్తున్న కుట్రలు సహించేది లేదు

Satyam NEWS

ఈ నెల 17, 18న ప్రతిపక్షాల ఉమ్మడి సమావేశం

Bhavani

Leave a Comment