ములుగు జిల్లా కేంద్రంలో ఈరోజు GBN ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రక్తదానం చేశారు. GBN ఎడ్యుకేషనల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటర్ బాధ్యులు Dr. హరీష్ కుమార్ ఆదేశానుసారం ములుగు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి లో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ములుగు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పేద రోగులకు,అత్యవసర సమయంలో అందరికీ ఆపద సమయాల్లో ఉపయోగపడుతుందన్న ఆలోచనతో, ఒక మంచి సదుద్దేశంతో 10 యూనిట్ల బ్లడ్ ని బ్లడ్ బ్యాంక్ సిబ్బందికి అందించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా DLPO దేవరాజ్ పాల్గొని వారు కూడ రక్తదానం చేశారు.
ఈ కార్యక్రమంలోములుగు జిల్లా DLPO దేవరాజ్, GBN రీజనల్ మేనేజర్ చల్లగురుగుల రాజు లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి చుంచు రమేష్ , రంజిత్, సురేందర్, రాజేందర్, శ్రీకాంత్, నాగరాజు బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ ప్రశాంత్ సిబ్బంది విజయ్, కృష్ణ, సతీష్, తదితరులు పాల్గొన్నారు.