31.7 C
Hyderabad
May 6, 2024 23: 11 PM
Slider నిజామాబాద్

బిచ్కుందలో బిజెపిని బలోపేతం చేస్తాం

bjp bichkunda

కామారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ నూతన మండల పార్టీ అధ్యక్షుల ఎంపిక  శనివారం బిచ్కుందలో జరిగింది. బిచ్కుంద  మండల పార్టీ అధ్యక్షులుగా పెరుగు క్రిష్ణారెడ్డి, మద్నూర్ అధ్యక్షులుగా హనుమాన్లు, జూకల్ అధ్యక్షులుగా ప్రశాంత్ పటేల్, పెద్దకొడప్గల్ అధ్యక్షులుగా పెండ్యాల హనుమాన్లు, పిట్లం అధ్యక్షులుగా చంద్రయ్య స్వాములను ఎన్నుకున్నట్లు మాజీ శాసనసభ్యురాలు, భారతీయ జనతా పార్టీ నాయకురాలు అరుణతార తెలిపారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయడానికి నూతన కార్యవర్గం ఎన్నుకున్నామని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తేవడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు  పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు నూతన అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

ఇంకా అలక వీడని రాహుల్ గాంధీ

Satyam NEWS

మైనార్టీ గురుకుల కళాశాలల జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి 23న రాత పరీక్ష

Satyam NEWS

టిక్ టాక్ డేటా చైనా ప్రభుత్వానికి ఇవ్వడం లేదు

Satyam NEWS

Leave a Comment