రైతులు విత్తనాలను శుద్ధి చేయటం వల్ల మేలైన లాభాలను ఆర్జించ వచ్చని పావని అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మగ్దుంనగర్ గ్రామంలో ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న పావని రైతులకు ప్రయోగాత్మకంగా విత్తన శుద్ధిని ఎలా చేయాలో చూపించింది.
వరిలో కిలో విత్తనాలకు 3 గ్రాముల కార్బండిజమ్ కలిపి 24 గంటల తరువాత నారు పోసుకోవాలని వివరించారు.
దీనివలన భూమి నుండి ఎటువంటి రోగాలు పైరుకి రాకుండా ఉంటాయని కనుక విత్తన శుద్ధి ముఖ్యమని పావని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు పాల్గొని పావనిని అభినందించారు.