23.2 C
Hyderabad
May 8, 2024 02: 36 AM
Slider నిజామాబాద్

బాండ్ పేపర్ పాలిటిక్స్: కమిషన్ తీసుకుంటే రాజీనామా చేస్తా

#madanmohan

బాండ్ పేపర్ రాసిచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావు

ప్రభుత్వ పథకాల అమలు, కాంట్రాక్టులలో తాను ఒక్క రూపాయి కమిషన్ తీసుకోకుంటా పని చేస్తానని, ఒకవేళ అలా తీసుకున్నట్టుగా నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్ మోహన్ రావు తెలిపారు. అంతేకాకుండా ఇదే విషయాన్ని బాండ్ పేపర్ పై రాసి సంతకం చేసి మీడియాకు విడుదల చేశారు. ఆదివారం లింగంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మదన్ మోహన్ రావు మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ప్రభుత్వం ద్వారా వచ్చే కాంట్రాక్టులు గానీ, పథకాల అమల్లో గాని ఒక పైసా కూడా కమిషన్ తీసుకోకుండా నిస్వార్థంగా పనిచేస్తానని  స్పష్టం చేశారు.

ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ప్రభుత్వం ద్వారా వచ్చే పనులు, నిధులను పూర్తిగా స్థానిక ప్రజాప్రతినిధులకు కేటాయిస్తానన్నారు. సంబంధిత బాండ్ పేపర్ ను లింగంపేట్ మండలంలోని షెట్పల్లి-సంగారెడ్డిలో గ్రామస్తులు, యువకులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో మీడియాకు విడుదల చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన సురేందర్ అమ్ముడుపోయి కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలతో పాటు వచ్చిన కాంట్రాక్టులను ఆంధ్ర వారికి 40 శాతం కమిషన్ కు కట్టబెట్టాడని విమర్శించారు. ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు సురేందర్ కు తగిన బుద్ధి చెప్తారన్నారు. ఎల్లారెడ్డిలో బీఆర్ఎస్, బిజెపి ఒక్కటేనని, కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఎల్లారెడ్డి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి జై కోట్టి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించబోతున్నారని మదన్ మోహన్ ధీమా వ్యక్తం చేశారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

ఫాక్ట్ ఫైండింగ్: తమిళనాడుతో ‘కియా’ చర్చలు నిజమే

Satyam NEWS

మహా శివరాత్రి కోసం కోటప్పకొండకు ప్రత్యేక బస్సులు

Satyam NEWS

“ఊర్వశివో రాక్షసివో” చిత్రం నుండి “మాయారే” పాట విడుదల

Satyam NEWS

Leave a Comment