33.2 C
Hyderabad
May 4, 2024 01: 11 AM
Slider ఖమ్మం

స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ట బందోబస్త్

#strongroom

స్ట్రాంగ్ రూం వద్ద 24 గంటల పటిష్ట బందోబస్తు చేపట్టాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ అన్నారు. అదనపు కలెక్టర్, సాంఘీక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో ఏర్పాటుచేసిన వైరా నియోజకవర్గ ఇవిఎం స్ట్రాంగ్ రూం ను సందర్శించి, భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వైరా నియోజకవర్గ స్ట్రాంగ్ రూమ్ తనిఖీ చేపట్టినట్లు తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ చుట్టూ సిసి కెమెరాల ఏర్పాటు చేసినట్లు, ఏర్పాటు చేసిన ప్రతి సిసి కెమెరా పనిచేయునట్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 24 గంటల పోలీస్ పహారా ఉండాలన్నారు. తహసీల్దార్ ప్రతిరోజు స్ట్రాంగ్ రూమ్ సందర్శించి, భద్రతా ఏర్పాట్లు పరిశీలించాలన్నారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలన్నారు. అనంతరం వైరా తహసీల్దార్ కార్యాలయం నుండి జిల్లాలోని అందరూ తహసీల్దార్ లతో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం పై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. శనివారం సాయంత్రం లోగా పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం చేయాలని తహశీల్దార్లను ఆదేశించారు.

Related posts

భారీ వర్షాల కారణంగా తగ్గిపోయిన చార్ ధామ్ యాత్రీకులు

Satyam NEWS

పస్రా ఎటాక్:అప్పు చెల్లించమన్నందుకే దయ లేకుండా

Satyam NEWS

ఇన్ ఫ్లమేటరీ సిండ్రోమ్: చిన్నారి యధిత్య మరణం బాధాకరం

Satyam NEWS

Leave a Comment