వనపర్తి జిల్లా కేంద్రంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మంత్రి నిరంజన్ రెడ్డి పీఆర్వోపై సందీప్ రెడ్డిపై వనపర్తి టౌన్ పోలీస్ స్టేషన్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మంత్రి పీఆర్వోపై కేసు నమోదు అయిందని జిల్లా ఎస్పి రక్షిత కె. మూర్తి విలేకరులకు తెలిపారు. శ్రీరంగాపురంలో ఉద్యోగులపై కేసు నమోదైందని ఎస్పి తెలిపారు. ఎస్పి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తేదీ 27. 10. 2023నాడు వనపర్తి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వనపర్తి (తహ సిల్దార్) యాదగిరి వనపర్తి టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చి పీఆర్వోపై దరఖాస్తు పిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గా సందీప్ రెడ్డి హెల్త్ అసిస్టెంట్, రఘుపతిపేట్, కల్వకుర్తి నియోజకవర్గం నాగర్ కర్నూల్ జిల్లా డిప్యూటేషన్ పై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దగ్గర ఉన్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన తరువాత కూడా
పిఆర్వోగా 18.10.2023 వరకు పనిచేస్తున్నాడు. ఎన్నికల కోడ్ వచ్చిన తరువాత కూడా యధావిధిగా పనిచేస్తూ ఉన్నారు. ఎన్నికల నియమావళి అతిక్రమించి వాట్సాప్ గ్రూపుల్లో ప్రకటనలను పోస్ట్ చేశారు. సందీప్ రెడ్డి పై కేసు నమోదు చేయాలని వనపర్తి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు.మంత్రి పీఆర్వోపై సెక్షన్ 129 అండ్ 134 ఆఫ్ ఆర్పీ యాక్ట్ 1951. సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించిన వెంకటేష్, ఏపిఎం, సువర్ణ, సిసి, రహీం సిసి, ఐ కెపివి జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖలో ఉద్యోగులుగా ఉండి ఈ నెల 26న వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ మీటింగ్ కు శ్రీరంగాపురం మండలం నుండి మహిళలను స్థానిక బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో కలిసి బస్సుల ద్వారా తరలించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన చేసిన ఉద్యోగులపై శ్రీరంగాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయాలని సహాయ ఎన్నికల అధికారి ఎస్. మురళి ఫిర్యాదు చేశారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్