33.2 C
Hyderabad
May 4, 2024 01: 00 AM
Slider ఆదిలాబాద్

వరద బాధిత ప్రాంతాలలో బోథ్ ఎమ్మెల్యే పర్యటన

#bothmla

వరద బాధిత ప్రాంతాలలో తక్షణ చర్యలను చేపట్టాలని ఆదిలాబాద్ జిల్లా బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బంది పడుతున్న గుడిహత్నూర్ మండలంలోని టాకీగుడా తదితర గ్రామాలలో నేడు ఆయన పర్యటించారు.

టాకీగుడా లో తెగిన వంతెనను ఆయన పరామర్శించారు. ఆ గ్రామానికి త్రాగు నీరు అందక పోవడముతో వెంటనే ఈ రోజు త్రాగు నీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వరద బాధితుల ఎవరు బాధపడొద్దని భరోసాగా తాము ఉన్నామని ఆయన తెలిపారు. బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు వెంట మండల కన్వీనర్ కరాడ్ బ్రహ్మానందం, జితేందర్, జమీర్, దిలీప్, టాకీగుడా పటేల్, స్థానిక నాయకులు, మండల నాయకులు ఉన్నారు.

Related posts

సినీ నటుడు మోహన్ బాబు పై కేసు నమోదు చేయాలి

Satyam NEWS

పబ్ కల్చర్: బీరు బాటిళ్లతో రాహుల్ సిప్లిగంజ్ పై దాడి

Satyam NEWS

క్లీన్ విలేజ్: 29 తేదీ లోగా ప్రతి గ్రామంలో చెత్తను తొలగించాలి

Satyam NEWS

Leave a Comment