31.2 C
Hyderabad
May 3, 2024 00: 02 AM
Slider ఆధ్యాత్మికం

బ్రేక్ దర్శనాలు రద్దు

#ttd

తిరుమల శ్రీ‌వారి ఆలయంలో మార్చి 21న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మార్చి 22న ఉగాది ఆస్థానం నిర్వ‌హించ‌నున్నారు. ఈ సందర్భంగా మార్చి 21, 22 తేదీల్లో విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాలను టిటిడి ర‌ద్ధు చేసింది. ఈ కారణంగా మార్చి 20, 21వ తేదీల్లో విఐపి బ్రేక్‌ దర్శనాల‌కు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. కావున  భక్తులు ఈ విషయాన్ని గమనించి  సహకరించవలసిందిగా టిటిడి విజ్ఞప్తి చేసింది. అలాగే ఉగాది పర్వదినాన్ని పురస్క‌రించుకొని మార్చి 22వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని టిటిడి రద్దు చేసింది.

Related posts

నీట్, జేఈఈ ప్రాక్టీస్ టెస్ట్స్ సిద్ధం

Sub Editor

విజ‌య‌న‌గ‌రంలో ట్రాఫిక్ సిబ్బందికే ఝ‌లక్ ఇచ్చిన కేటుగాడు…!

Satyam NEWS

ఏపిలో జీతాలు, పింఛన్లు 3వ తారీకునే!

Satyam NEWS

Leave a Comment