పెళ్లి జరుగుతుండగా వధువు మరణించిన విషాదకర సంఘటన విశాఖపట్నం లో జరిగింది. దీంతో మధురవాడ పెళ్ళింట విషాదం నెలకొంది. జీలకర్ర బెల్లం తలమీద పెడుతున్న సమయంలో వధువు మృతి చెందింది.
వరుడు తెలుగు యువత అధ్యక్షుడు శివాజీ. ఆయన కు సృజన తో వివాహ ముహూర్తం నిర్ణయించారు. వైభవంగా వివాహ కార్యక్రమం జరుగుతున్నది. జీలకర్ర బెల్లం పెడుతుండగా సృజన సృహ కోల్పోయింది. వెంటనే బంధువులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె చికిత్స పోందుతూ మృతి చెందారు.