38.2 C
Hyderabad
May 5, 2024 19: 14 PM
Slider వరంగల్

ఆస్తి తగాదాలో అన్నను హత్య చేసిన తమ్ముడు

#murdercase

ఆస్తి తగాదాలో   అన్నను హత్య చేసిన ఘటన ములుగు జిల్లా ములుగు మండలం  మల్లంపల్లి గ్రామంలో శుక్రవారం   వెలులోకి వచ్చింది. ఈ హత్యకు సంబంధించిన నిందితులను ములుగు సిఐ రంజిత్ కుమార్ మీడియా కు ముందు ప్రవేశ పెట్టారు. వివరాల్లోకి వెళితే ములుగు జిల్లా  ములుగు మండలం రాజుపల్లె గ్రామానికి చెందిన అన్న కావటి బిక్షపతి కి  తమ్ముడు కవటి సుధాకర్ మధ్య గత కొన్ని సంవత్సరాలుగా భూ వివాదం కొనసాగుతుంది. ఈ క్రమంలో  జనవరి 31న  బుధవారం  బిక్షపతి పొలం వద్ద కు నీళ్లు పెట్టడానికి వెళ్ళగా హత్య చేయడానికి విద్యుత్ తీగల కు విద్యుత్ కనెక్షన్  కనెక్షన్ ఇవ్వడంతో కావిడి బిక్షపతికి విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. కాగా బిక్షపతి భార్య తన భర్త బిక్షపతి మృతి పట్ల అనుమానంగా ఉందని జనవరి 31న ములుగు ఫిర్యాదు తెలియజేయడం జరిగింది. ఈ విషయమై విచారణ చేసిన పోలీసులు పథకం ప్రకారమే బిక్షపతిని విద్యుత్ షాక్ ద్వారా హత్య చేశారని విచారణలో తేలింది. దీంతో నిందితులు కావటి సుధాకర్,  అతని భార్య మాధవిలను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరిచినట్టు సిఐ రంజిత్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎస్ఐ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

Related posts

పట్టభద్రుల ఎమ్మెల్సీకి ములుగు జిల్లా జాగృతి శుభాకాంక్షలు

Satyam NEWS

8 ఏళ్ల బాలిక పై అత్యాచారం హత్య కేసు నిందితుడికి ఉరిశిక్ష

Bhavani

పేకాట స్థావరంలో దొరికిన ఆంధ్ర‌జ్యోతి క‌డ‌ప మేనేజ‌ర్

Satyam NEWS

Leave a Comment