ఆంధ్రజ్యోతి దినపత్రిక కడప మేనేజర్ మద్దిపట్ల రఘునాథనాయుడితో పాటు మరో ఐదుగురిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.
కడప నగరం చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పక్కీర్పల్లి తూర్పు వైపు సమాధుల పక్కన కంప చెట్లలో ఆరుగురు వ్యక్తులు పేకాట ఆడుతున్న సమాచారం పోలీసులకు అందింది.
దాంతో పోలీసు సిబ్బంది కలిసి వెళ్లి దాడి చేశారు. పేకాట ఆడుతూ ఆరుగురు పట్టుబడ్డారు. పోలీసులకు చిక్కిన వాళ్లలో ఆంధ్రజ్యోతి కడప మేనేజర్ రఘునాథనాయుడు ఉన్నారు.
సీఐ కె.అశోక్రెడ్డి నేతృత్వంలో ఎస్ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేశారు.