40.2 C
Hyderabad
April 29, 2024 18: 21 PM
Slider ప్రకాశం

8 ఏళ్ల బాలిక పై అత్యాచారం హత్య కేసు నిందితుడికి ఉరిశిక్ష

#rape

ప్రకాశం జిల్లాలో 8 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన వ్యక్తికి జిల్లా కోర్టు సంచలనం తీర్పు ఇస్తూ నిందితుడికి ఉరి శిక్ష విధించింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం అంబవరం గ్రామానికి చెందిన దూదేకుల సిద్దయ్య 2021 జూలై 8వ తేదీన వరుసకు కూతురు అయ్యే ఎనిమిది సంవత్సరాల బాలికను అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు.

ఈ ఘటనపై పోలీసులు నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పూర్తి సాక్షాధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు. జరిగిన ఘటనపై విచారించిన జిల్లా కోర్టు నిందితుడు చేసిన నేరం తీవ్రమైనదిగా భావించి ఉరిశిక్షను ఖరారు చేసింది. బాలికను అత్యాచారం చేసి ఆపై క్రూరంగా హత్య చేసిన నిందితుడికి జిల్లా కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

గుండెపోటుతో మరో ఆర్టీసీ డ్రైవర్ మృతి

Satyam NEWS

భూమిలో నత్రజని స్థిరీకరణకు జీలుగ విత్తనాలు వేయండి

Satyam NEWS

విక్రమ్ ల్యాండర్ పై ఆశ వదులుకోవాల్సిందేనా?

Satyam NEWS

Leave a Comment