కుల సంఘాలకు బిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడిందనీ, సి ఏం కేసీఆర్ నాయకత్వంలో అన్ని కుల సంక్షేమ సంఘాలకు న్యాయం జరిగిందని ఉప్పల్ బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం, హెచ్ బి కాలని ఎన్ టి ఆర్ నగర్ కమిటీ హాల్లో, మేరు కుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రుద్రంగి కరుణాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. దసరా ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యతిథిగా బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మేరు కుల సంక్షేమ సంఘం వారు తమ సంఘానికి ఒక భవనం నిర్మించాలని అందుకు అనువైన కొంత స్థలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ, బండారి లక్ష్మారెడ్డి కి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించి, ఉప్పల్ నియోజకవర్గంలో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తామని ఏకగ్రీవంగా తీర్మాణం చేశారు. ఈ సందర్బంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో అన్ని కుల సంక్షేమ సంఘాలకు న్యాయం జరిగిందని గుర్తుచేశారు .ఉప్పల్ నియోజకవర్గంలో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి, బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, తప్పకుండా భవన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా