34.2 C
Hyderabad
May 14, 2024 21: 23 PM
Slider మహబూబ్ నగర్

బి ఆర్ ఎస్ పార్టీని ఓడించాలి

#telanganajanasamiti

తెలంగాణ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీని ఓడించడంలో ఉద్యమకారుల పాత్రే కీలకం కానుందని తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అద్యక్షుడు యంఏ ఖాదర్ పాష చెప్పారు. అమరుల త్యాగాలతో ఏర్పాటు చేసుకున్న తెలంగాణలో గత 10 ఏండ్లుగా దోపిడి చేస్తున్న  కె సి ఆర్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని అయన పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ దుష్ట పాలనను అంతం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అన్నారు. రానున్న కాలంలో  ఉద్యమకారులు, మేధావులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, ఉద్యోగులు అందరూ ఏకమై బి ఆర్ ఎస్ ను అంతం చేయడం కోసం రానున్న 24 రోజులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని అన్నారు.

కోదండరామ్ లాంటి ఉద్యమకారులను అణచివేసి ఉద్యమ ద్రోహులకు అధికార పదవులిచ్చిన కె సి ఆర్ నేడు ఉద్యమకారులను బైండోవర్ పేరుతో వేధింపులు చేస్తున్నాడని విమర్శించారు. ఈ  కార్యక్రమంలో

జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ కుమార్ శెట్టి, పట్టణ అధ్యక్షుడు రఘు నాయుడు, పట్టణ ప్రధాన కార్యదర్శి శాంతారావు నాయక్, పానగల్ మండల అధ్యక్షుడు సహదేవుడు, రేవల్లి మండల అధ్యక్షుడు బాలు నాయుడు, గణపురం శేషగిరిరావు, వనపర్తి పిక్కిలి బాలయ్య, బాలకృష్ణ  పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యంన్యూస్.నెట్

Related posts

వరద సాయంలోనూ తెలంగాణపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం వివక్ష

Satyam NEWS

నెగ్లిజెన్స్: చిత్తడి చిత్తడిగా చిలుకల గుట్ట దారి

Satyam NEWS

ఎజెండా: ప్రభుత్వ పథకాలు ప్రజల దరికి చేరాలి

Satyam NEWS

Leave a Comment