భక్తుల కోసం ఏర్పాటు చేసిన షెడ్ల నిర్మాణం జాతర వరకు అందే పరిస్థితులు లేవని ఎమ్మెల్యే గుర్తించారు. అదే విధంగా విఐపి దారి గుండా దుమ్ము రేగుతుందని, కొన్ని చోట్ల వాహనాలు పోయే పరిస్థితి లేదని ఆమె వ్యాఖ్యానించారు. మరీ ముఖ్యంగా చిలుకల గుట్ట కు పోయే దారి మొత్తం బురద మాయం అయిందని, చిత్తడి చిత్తడిగా ఉందని ఆమె అన్నారు.
కనీసం ఇప్పటికైనా అధికారులు అప్రమత్తం అయి పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే సీతక్క కోరారు. జాతర ముందు నెల నుంచి చెబుతున్నా అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహించారని ఆమె అన్నారు. ఇప్పటికైనా కాంట్రాక్టర్లు పనులు వేగవంతం చెయ్యాలని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఎమ్మెల్యే కోరారు.
భక్తులకు ఇబ్బందులు రాకుండా పనులు చేయాలనీ పలు మార్లు చెప్పిన కాంట్రాక్టర్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ పనులలో జాప్యం చేస్తున్నారని ఆమె అన్నారు. తాడ్వాయి మండలంలోని రోడ్డు పరిస్థితులను ఆమె పరిశీలించారు.