దేశ వ్యాప్తంగా గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ పార్టీ యుద్ధం ప్రకటించింది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై భారాస ఎంపీలకు సీఎం కేసీఆర్ ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. దాదాపు 3గంటల పాటు జరిగిన సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని భారాస పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని, ప్రతి బడ్జెట్లోనూ వివక్ష ప్రదర్శిస్తున్నారని, ఆర్ధిక అంశాలపై ఆంక్షలు విధించడం, రైతుల విషయంలో వివక్ష చూపడం.. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలిపేందుకు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని సమావేశంలో నిర్ణయించారు.
previous post