ఆధార్ కార్డు మార్చి భూమిని కాజేసి విక్రయించిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అనంతపురం జిల్లాలో మరో భూ అక్రమ రిజిస్ట్రేషన్ దందా బాగోతం బయటకు వచ్చింది. అనంతపురం నగరానికి చెందిన రామదాసు కి బుక్కరాయసముద్రం మండలం రోటరీ పురం వద్ద సర్వే నంబర్ 20/1 నందు 2.06 ఎకరాల భూమి ఉంది.
ఈ భూమి పై నార్పల మండలం గూగూడు గ్రామానికి చెందిన శ్రీరాములు, ఎర్రప్ప, జాఫర్ లు కన్నేశారు. అందులో భాగంగా భూమి హక్కు దారుడైన రామదాసు ఆధార్ కార్డు నెంబర్ మార్చి శివ అనే వ్యక్తి ద్వారా సూర్యనారాయణ, శివ శంకర్ రెడ్డి లకు అమ్మేశారు. ఈ విషయం తెలుసుకున్న భూమి హక్కుదారుడైన రామదాసు బుక్కరాయ సముద్రం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన బుక్కరాయ సముద్రం పోలీసులు భూ అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
సత్యం న్యూస్.నెట్, అనంతపురం