40.2 C
Hyderabad
April 29, 2024 16: 41 PM
Slider అనంతపురం

అనంతపురంలో అక్రమ రిజిస్ట్రేషన్ భూ దందా

#bukkarayapatnam

ఆధార్ కార్డు మార్చి భూమిని కాజేసి విక్రయించిన  నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అనంతపురం జిల్లాలో మరో భూ అక్రమ రిజిస్ట్రేషన్ దందా బాగోతం బయటకు వచ్చింది. అనంతపురం నగరానికి చెందిన రామదాసు కి బుక్కరాయసముద్రం మండలం రోటరీ పురం వద్ద సర్వే నంబర్ 20/1 నందు 2.06 ఎకరాల భూమి ఉంది.

ఈ భూమి పై నార్పల మండలం గూగూడు గ్రామానికి చెందిన శ్రీరాములు, ఎర్రప్ప, జాఫర్ లు కన్నేశారు. అందులో  భాగంగా భూమి హక్కు దారుడైన రామదాసు ఆధార్ కార్డు నెంబర్ మార్చి శివ అనే వ్యక్తి ద్వారా సూర్యనారాయణ, శివ శంకర్ రెడ్డి లకు అమ్మేశారు. ఈ విషయం తెలుసుకున్న భూమి హక్కుదారుడైన రామదాసు బుక్కరాయ సముద్రం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన బుక్కరాయ సముద్రం  పోలీసులు  భూ అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.

సత్యం న్యూస్.నెట్, అనంతపురం

Related posts

కర్నాటకలో భారీగా నగదు ఆభరణాలు స్వాధీనం

Satyam NEWS

వర్గీకరణ చేసేవరకూ ఉద్యమం తీవ్రతరం

Satyam NEWS

కంచరపాలెంలో రౌడీషీటర్ దారుణ హత్య

Satyam NEWS

Leave a Comment