బుల్లెట్ రైలు అనగానే గుర్తొచ్చేది జపాన్, చైనాలే. అయితే, ఇప్పుడు చైనా ఇంకో అడుగు ముందుకేసింది. డ్రైవర్లెస్ కార్లలాగే డ్రైవర్ అవసరం లేని బుల్లెట్ రైలును తయారు చేసింది. తయారు చేయడమే కాదు, పట్టాలపైకి ఎక్కించి పరుగులు పెట్టించింది. 2022 బీజింగ్ ఒలింపిక్స్కు కౌంట్డౌన్ కొనసాగుతున్న టైంలోనే చైనా ఈ రైలును ప్రారంభించింది.
గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ బుల్లెట్ ట్రెయిన్, డ్రాగన్ కంట్రీ రాజధాని బీజింగ్ నుంచి ఒలింపిక్స్ జరిగే ఝాంగ్జియాకు సిటీకి పరుగులు పెడుతుంది. ఇప్పటిదాకా ఆ రెండు సిటీల మధ్య ప్రయాణ దూరం 3 గంటలు కాగా, ఈ బుల్లెట్ రైలులో కేవలం 47 నిమిషాల్లోనే చేరుకోవచ్చట. డ్రైవర్ లేని బుల్లెట్ రైళ్లలో ఇదే ఫస్ట్ అని చెబుతున్నారు. జింగ్ఝాంగ్ హై స్పీడ్ రైల్వేస్లో భాగంగా ఈ రైలును, రైల్వే లైన్ను రెడీ చేశారు.
దానికి దాదాపు నాలుగేళ్లు పట్టిందట. బీజింగ్, యాంఖింగ్, ఝాంగ్జియాకు రూట్లలో తిరుగుతుంది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఉండే బదాలాంగ్ చాంగ్షెంగ్ ప్రాంతం సహా 10 స్టేషన్లలో ఈ రైలు ఆగుతుందట. డిసెంబర్ 30నే దీని సర్వీస్ ప్రారంభమైంది. బీజింగ్ నార్త్రైల్వే స్టేషన్ నుంచి తైజీషెంగ్ రైల్వేస్టేషన్కు ఫస్ట్ ట్రిప్పు వెళ్లింది. దీంట్లో టికెట్లు కావాలంటే రెండు రోజుల ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుందట.