జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలన్నింటిలో వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలు జరిగేలా చర్యలు చేపట్టాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశపు హాలులో మార్కెటింగ్ శాఖ అద్వర్యంలో వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీలు మరియు ఉప మార్కెట్ కమిటీలలో రైతులు తాము పండించిన పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరిగే విధముగా జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో ఉన్న ట్రేడర్స్ కొనుగోలు చేయాలని చెప్పారు. రైతుల ఉత్పత్తుల క్రయవిక్రయాలు మార్కెట్ యార్డులలో నిర్వహించాలని చెప్పారు. ఈ సమావేశంలో శ జిల్లా మార్కెటింగ్ అధికారి అలీం, జిల్లా వ్యవసాయ అధికారి అభిమన్యుడు, జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల కార్యదర్శులు మరియు జిల్లాలోని ప్రైవేట్ ట్రేడర్స్ తదితరులు పాల్గొన్నారు.
previous post