తిరుమల తిరుపతి దేవస్ధానం ( టీటీడీ ) ఆధ్వర్యంలోని ఎస్వీబీసీ సలహదారుగా సీనియర్ జర్నలిస్ట్ దుర్గ బాధ్యతలు స్వీకరించారు. తిరుపతిలోని ఎస్వీబీసీ కార్యాలయంలో నేడు ఆయన బాధ్యతలు స్వీకరించడం జరిగింది.
గత 26 సంవత్సరాల నుండి జర్నలిస్ట్ గా పనిచేస్తున్న తనకు తిరుమల శ్రీవారి సేవలో ఈ బృహత్తర యజ్ఞంలో భాగస్వాములు చేసి అడ్వైంజర్ గా నియమించిన సీఎం జగన్ కు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కి, టీటీడీ ఇవో
ధర్మారెడ్డికి కృతజ్ఞతలు తెలుపిపారు. ఎస్వీబీసీ ద్వారా మెరుగైన సేవలు అందించి భక్తులు మరింత చేరువయ్యే కార్యక్రమాల రూపకల్పనలో తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు.