నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శనివారం ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఐ టి శాఖా మంత్రి కేటీఆర్ , మంత్రి మల్లారెడ్డి , ఉప్పల్ ఎమ్ ఎల్ ఏ భేతి సుభాష్ రెడ్డి సమక్షంలో మల్లాపుర్ కార్పొరేటర్, స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు పన్నాల దేవేందర్ రెడ్డి అధ్వర్యంలో ముద్రించిన మల్లాపూర్ డివిజన్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం కే టీ ఆర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్యక్రమంలో మీర్పేట్-హౌసింగ్ బోర్డ్ కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్, చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, చిలకనగర్ కార్పొరేటర్ బన్నల గీతా ప్రవీణ్, నాచారం కార్పొరేటర్ శాంతి శేఖర్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, నాయకులు సాయి జెన్ శేఖర్, వెంకటేశ్వర రెడ్డి, తండా వాసుగౌడ్, జబ్బార్, గరికే సుధాకర్, సనాల రవి, నర్సింగ్, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి