కొల్లాపూర్ పట్టణం లో ఎస్సీ, ఎస్టీ, బిసి హాస్టల్ విద్యార్థిని విద్యార్థులు వీర జవాన్లకు నివాళి అర్పిస్తూ భారీ ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కొల్లాపూర్ నియోజక వర్గం ప్రభుత్వ వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
గత సంవత్సరం ఫిబ్రవరి 14 నాడు పుల్వామా దాడిలో అమరత్వం పొందిన 41 మంది జవాన్లకు కొవ్వొత్తులతో భారీ ర్యాలీగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు డాక్టర్ సిద్దయ్య, ఈశ్వరయ్య, టీఎన్జీవో నాగర్ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు, వసతి గృహ అధికారుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పసుల సత్యనారాయణ యాదవ్, కొల్లాపూర్ డివిజన్ టీఎన్జీవో వైస్ ప్రెసిడెంట్, వసతి గృహ అధికారి బాలరాజు మాట్లాడుతూ ప్రతి పౌరుడు దేశ భక్తి కలిగి ఉండాలని, చిన్నప్పటి నుంచి పిల్లలకు ఈ భావాలు నాటవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దేశం మొత్తం ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇంటికో జవానును తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వసతిగృహ అధికారులు ఆంజనేయులు, చంద్రకళ, వసతి గృహ ట్యూటర్ లు రమేష్ వెంకటరమణ, మధు, వసతి గృహ సిబ్బంది ఈశ్వరయ్య, దామోదర్, గుంతమ్మ మధు, స్వామి తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.