విజయనగరం ఇంచార్జ్ డీఎస్పీ ఆధ్వర్యంలో ఫిర్యాదులు స్వీకరణ…!
ప్రతీ సోమవారం మాదిరిగా నే ఈ వారం విజయనగరం పోలీసు శాఖ…”స్పందన’ కార్యక్రమం నిర్వహించింది…అదీ ఆ శాఖ బాస్..ఎస్పీ లేకుండా నే. మూడు రోజుల పాటు జిల్లా ఎస్పీ సెలవు పెట్టడం తో…ఎస్పీ ఆదేశాలతోనే ఎస్టీ, ఎస్సీ ,విజయనగరం ఇంచార్జ్ డీఎస్పీ శ్రీనివాసరావు సమక్షంలో.. పోలీసు “స్పందన” కార్యక్రమం జరిగింది. ఈ “స్పందన”లో దాదాపు 35 మంది బాధితులు తమ.గోడు, బాధ ,ఆవేదన ను విజయనగరం ఇంచార్జ్ డీఎస్పీ కి విన్నవించుకున్నారు. కాగా ఎస్పీ ఎం.దీపిక, ఆదేశాలతో జిల్లా పోలీసు కార్యాలయంలో విజయనగరం ఇన్ ఛార్జ్ డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు “స్పందన” కార్యక్రమాన్ని తీసుకున్నారు. ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి, వారి సమస్యలు తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోనులో మాట్లాడి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సిఐలు జే.మురళి, రుద్రశేఖర్, ఎస్ఐలు వాసుదేవ్, ప్రభావతి ,ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.