ప్రముఖ బాలివుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ కు రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కోడలు, నటుడు అభిషేక్ బచ్చన్ భార్య అయిన ఐశ్వర్య రాయ్ తరచుగా ఇలాంటి వివాదాలలో చర్చకు వస్తుంటారు. ప్రస్తుతం ఈ నటికి ఇచ్చిన నోటీసుకు సంబంధించిన విషయం వెలుగులోకి వచ్చింది.
నాసిక్ లో ఆమె పేరుతో ఉన్న భూమికి బకాయి పన్నును జమ చేయనందుకు ఐశ్వర్యరాయ్కి నోటీసు జారీ చేశారు. నాసిక్ తాసిల్దార్ ఐశ్వర్య రాయ్ కి ఈ నోటీసులు పంపారు.