విజయనగరం జిల్లాలో రేగిడి మండలం ఎం.డోలపేట లో ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి జరిగింది. ఈ ఘటనపై స్పందించింది జిల్లా యంత్రాంగం.ఈ దాడి ఘటనలో ఇరవై మంది వేతన దారులపై తేనెటీగలు దాడి చేయగా తీవ్రంగా గాయపడిన ముగ్గురిని పాలకొండ ఏరియా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
మిగిలిన వారందరికీ గ్రామంలోనే ప్రాథమిక చికిత్స అందిచామని తెలిపారు.
ఆసుపత్రిలో చేరిన వారంతా కోలుకుంటున్నారు, మండల స్థాయి అధికారులు ఆసుపత్రిలోనే వుండి వారికి అవసరమైన వైద్య సహాయం అందించే ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఈ తేనెటీగల దాడిలో గాయపడిన వారెవ్వరికీ ప్రాణాపాయం లేదని జిల్లా కలెక్టర్ సూర్యకుమారి తెలిపారు.