రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, కడప మాజీ పార్లమెంటు సభ్యుడు వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతున్నది.
జిల్లా కేంద్ర కారాగారం కేంద్రంగా రెండవ రోజు వివేకా హత్య కేసుపై సిబిఐ విచారణ నిర్వహించింది. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి భార్య, మరో మహిళ మరోమారు విచారణకు హాజరయ్యారు.
నిన్న మహిళలిద్దరినీ ఆరు గంటల పాటు సీబీఐ అధికారులు విచారించారు. కీలక వ్యక్తులు, అనుమానితులను సీబీఐ బృందం విచారిస్తున్నది.
సీబీఐ బృందం కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నాక విచారణను వేగవంతం చేసింది. అదే విధంగా కర్నూల్ జిల్లా కు చెందిన వైద్యుడు కూడా విచారణకు హాజరయ్యారు.
ఈ హత్య కేసుకు సంబంధించి కీలక ఆధారాలు, సాక్ష్యాలు ఇప్పటికే సీబీఐ చేతికి చిక్కినట్లుగా భావిస్తున్నారు. సాక్షులను మరో మారు విచారించిన తర్వాత సీబీఐ తదుపరి చర్యలకు ఉపక్రమిస్తుంది.