28.2 C
Hyderabad
May 9, 2024 01: 10 AM
Slider కృష్ణ

ఈ 9 ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముందా?

#S. Vishnuvardhana Reddy

భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అడిగిన ప్రళ్నలకు భయపడి, సమాధానం చెప్పలేని వైకాపా నేతలు మంత్రులు వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని భాజపా నేత ఎస్‌.విష్ణువర్ధనరెడ్డి అన్నారు. విజయవాడ లోని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 4 ఏళ్ల వైకాపా పాలనపై భాజపా వేస్తున్న 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ ప్రశ్నలపై తితిదే ఛైర్మన్‌ వైవి.సుబ్బారెడ్డి 24 గంటల్లో శ్వేత్రపత్రం విడుదల చేస్తామని చెప్పినా 48 గంటలైనా ఆ పనిచేయలేకపోయారు. సమాధానం లేదని పారిపోయారా? అని ఆయన ప్రశ్నించారు.

1). బాలల అక్రమ రవాణా విషయంలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంద్రప్రదేశ్‌ 3 వ స్ధానంలో ఉంది. ఈ వైఫల్యానికి మీ సమాధానం ఏంటి?

2). తలసరి ఆదాయంలో దక్షిణాధిరాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ ఎందుకు వెనుకబడింది. వ్యవసాయం, ఆక్వా, ఉద్యానరంగం ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రంలో ఎందుకు తలసరి ఆదాయం పెరగలేదు ?

3). జలజీవన్‌ మిషన్‌ పథకాన్ని రాష్ట్రంలో ఎందుకు వినియోగించుకోలేదు? ఈ పథకానికి అయ్యే ఖర్చులో కేంద్రం ఇచ్చే ఆర్ధిక సహయాన్ని ఎందుకు ఉపయోగించుకోలేదు? ఎందుకు ప్రజలకు మంచినీటిని అందించలేకపోయారు?

4). కేంద్ర ప్రభుత్వం పేదల కోసం కేటాయించిన 25 లక్షల ఇళ్లను ఎందుకు నిర్మించి ఇవ్వలేకపోయారు? ఇళ్ల స్థలాల్లో వచ్చే కమిషన్‌ కోసం 30 లక్షల ఇళ్ల స్థలాలను సేకరించారు. ఇళ్లు నిర్మిస్తే కమిషన్‌ కాదు కాబట్టి ఆ పనిచేయలేదా?

5). రాష్ట్రంలో పేదలకు అందించే వైద్య సదుపాయాల విషయంలో ఎందుకు విఫలమయ్యారు? పట్టణ, గ్రామీణ వైద్య, ఆరోగ్యకేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు, జనరల్‌ ఆసుపత్రుల్లో ఎందుకు వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు ? వైద్య పరీక్షలు అందుబాటులో లేవు? మందులు ఎందుకు ఇవ్వడం లేదు? వైద్యులు, వైద్య సిబ్బంది ఖాళీలు ఎందుకు భర్తీ చేయడం లేదు?

6). ప్యానల్‌లో ఉన్న 80 శాతం కార్పొరేట్‌ ఆసుపత్రులు ఎందుకు ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యం చేయడం లేదు? వారికి బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు?

7). ఉన్నత విద్యను ఎందుకు నిర్ల్యక్షం చేశారు? పీజీ విద్యార్థులకు ఎందుకు ఉపకారవేతనాలు దూరం చేశారు. డిగ్రీలో తెలుగును రద్దుచేశారు. ఆంగ్లభాషకే ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

8). ప్రభుత్వోద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదు? వర్శిటీల్లో ఉపన్యాసకులు, కళాశాలల్లో లెక్చరర్లను, పాఠశాలల్లో టీచర్లను ఎందుకు భర్తీచేయలేదు? ఖాళీగా ఉన్న 2.50 లక్షల బాక్‌లాగ్‌ పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదు?

9). రాష్ట్రంలో ఛిద్రమైన రహదారులను ఉందుకు పునర్నిర్మించలేదు? వైకాపా మంత్రులు కారుయాత్ర చేస్తే రోడ్ల పరిస్థితి తెలుస్తుంది.

తిరుపతిలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు చేసిన ద్రోహంపై, గుంటూరులో అమరావతి రైతులకు చేసిన అన్యాయంపై, పంచాయతీ నిధుల మళ్లింపుపై, రైతులకు రాయితీలు ఇవ్వకపోవడంపై, రాజమండ్రిలో అక్వా ఉత్పత్తుతులకు సహకారం ఇవ్వకపోవడం, విశాఖలో భూకబ్జాలు, దిగజారిన శాంతిభద్రతలు, పారిశ్రామిక అభివృద్ధిని పురందేశ్వరి ప్రశ్నించారు.

అమెను విమర్శించే మంత్రులు ముందుగా ఆయా శాఖలకు ఏం పనులు చేశారో, ఎంత వరకు అభివృద్ధి చేశారో చెప్పాలి అని ఆయన ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి విశాఖ అభివృద్ధికి ఏంచేశారు? రోజా పర్యాటక శాఖ అభివృద్ధికి ఏం చేశారు? గుడివాడ అమర్నాధ్‌ ఎన్ని కొత్త పరిశ్రమలు తెచ్చారు? ఎంత మందికి ఉపాధి కల్పించారు? అని ఆయన ప్రశ్నించారు.

ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా ఏటా ఇచ్చే రూ.400 కోట్ల నిధులతో ఒక్కో మనిషికి రూ.5 లక్షల విలువైన వద్య సదుపాయం లభిస్తుంటే ఎందుకు దాని గురించి మాట్లాడరు? వైద్యకేంద్రాలు, పంచాయతీ భవనాలు, స్కూలు భవనాలు, ఆర్‌బీహెచ్‌లు, రహదారులు, పర్యాటక కేంద్రాలకు కేంద్రం ఇచ్చే నిధులతో తప్ప రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు అని ఆయన విమర్శించారు.

Related posts

`గ‌ని`గా మెగాప్రిన్స్ వ‌రుణ్‌తేజ్‌: ఫస్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Satyam NEWS

కృష్ణాజిల్లాలో ఐదు చోట్ల పిడుగుపాటు: ఒకరి మృతి

Satyam NEWS

కంకణం కట్టుకుందాం….కమలం పార్టీని గెలిపిద్దాం…

Satyam NEWS

Leave a Comment