ఈనెల 16వ,తేది నుండి 18వ, తేది వరకు మూడు రోజుల పాటు జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించాలని,శుక్రవారం నియోజకవర్గంలో 15 వేల మందితో భారీ ర్యాలీని హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఇందిరా చౌక్ లో సభా ప్రాంగణాన్ని,ఎన్ ఎస్ పి క్యాంప్ లో భోజన స్థలం ఏర్పాటును శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ మూడు రోజుల పాటు జాతీయ సమైక్యత వజ్రోత్సవలను నిర్వహించుటకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలలో భాగంగా శుక్రవారం హుజూర్ నగర్ పట్టణంలో పొట్టి శ్రీరాముల విగ్రహం (పాత బస్టాండ్) నుండి ఇందిరా చౌక్ వరకు ఉదయం 9 గంటలకు 15 వేల మందితో భారీ ర్యాలీనీ నిర్వహించిన అనంతరం ఎన్ ఎస్ పి క్యాంపు గ్రౌండ్ నందు నిర్వహించు భోజన స్థల ప్రాంగణాన్ని గురువారం సాయంత్రం మున్సిపల్ కమిషనర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రామలింగారెడ్డి, ఆర్డిఓ వెంకారెడ్డి తో కలిసి సైదిరెడ్డి పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్,పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, కౌన్సిలర్లు,ఆయా శాఖల అధికారులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్