ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీమంత్రి వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ మళ్లీ ప్రారంభించింది. నెలరోజుల విరామం తర్వాత కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో అనుమానితులను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో అనుమానితులను సీబీఐ అధికారులు ప్రశ్నించారు.
మాజీ టీవీ-9 రిపోర్టర్ సదాశివరెడ్డిని విచారించారు. హత్య జరిగిన తర్వాత కొన్ని నెలలకు సునీల్ గ్యాంగ్ ఆగడాలపై ఆ ఛానల్లో కథనం ప్రసారం అయ్యింది. వివేకాను సునీల్ గ్యాంగ్ హత్య చేసిందా అనే కోణంలో ఆ కథనం ప్రసారం చేశారు. దీనికి సంబంధించిన వివరాలను సీబీఐ అధికారులు సదాశివారెడ్డిని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. దాదాపు మూడు గంటల పాటు అతన్ని సీబీఐ అధికారులు ప్రశ్నించారు.