ఈ నెల 26, 27 తేదీల్లో ఎస్బీఐ బ్యాంకులు పనిచేస్తాయని ఆ సంస్థ యాజమాన్యం ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొంది. బ్యాంకులకు సెలవు దినాలైనప్పటికి మార్చి 26న నాల్గవ శనివారం, 27న ఆదివారం ప్రజల ప్రయోజనార్థం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న తమ 52 బ్రాంచీలు పనిచేస్తాయని ఎస్బీఐ తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ కమిషనర్కు ఎస్బీఐ లేఖ రాసింది. ప్రజలు చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజును, చలాన్లను చెల్లించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ తెలిపింది.
previous post
next post