31.2 C
Hyderabad
February 11, 2025 21: 14 PM
Slider ప్రత్యేకం

మాజీ ఎంపీ రాయపాటి ఇళ్లపై సీబీఐ దాడులు

Rayapati-Sambasiva-Rao

తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు ఇంటిపై సీబీఐ దాడులు జరిగాయి. ఉదయం నుంచి రాయపాటి ఇల్లు, ఆఫీస్ లో సోదాలు కొనసాగుతున్నాయి. రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ తో పాటు పలు కంపెనీల్లో కూడా సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు.

హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ఢిల్లీలోకూడా ఏకకాలంలో సీబీఐ సోదాలు కొనసాగడం గమనార్హం. బ్యాంకు నుంచి రుణం గా తీసుకున్న రాయపాటి కంపెనీ తిరిగి చెల్లించలేదు. ఆ మొత్తం సుమారు 300 కోట్ల రూపాయలు మేరకు ఉన్నట్లు తెలిసింది. రాయపాటి కంపెనీ పై కేసు నమోదు చేశారు.

రాయపాటి ఇల్లు, కంపెనీలతోపాటు ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ సీఈవో ఇళ్లపై సీబీఐ దాడులు కొనసాగుతున్నాయి. ఈ సోదాల సందర్భంగా పలు కీలక డాక్యూమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

Related posts

వనపర్తిలో ప్రజా డాక్టర్ బాలకిష్టయ్య వర్ధంతి

Satyam NEWS

ఉమ్మడి ఏపికి వైఎస్ చేసిన సేవలు చిరస్మరణీయం

Satyam NEWS

కొల్లాపూర్ ఎస్బీఐ ముందు ప్రజలకు తప్పని తిప్పలు

Satyam NEWS

Leave a Comment