సీబీఐటీ ఫిజిక్స్ విభాగంలో అటెండర్ గా పని చేస్తున్న శ్రీహరి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. పేద కుటుంబానికి చెందిన శ్రీహరి అంత్యక్రియలు నిర్వహించేందుకు సీబీఐటీ యాజమాన్యం ఆర్ధిక సాయం అందించింది. 20 వేల రూపాయల చెక్కును కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి రవీందర్ రెడ్డి నేడు శ్రీ హరి భార్య కు ఆందజేశారు. ఈ సందర్భంగా ఫిజిక్స్ విభాగధిపతి ప్రొఫెసర్ బి శ్రీనివాస్ రెడ్డి, బోధనేతర కార్యనిర్వాహక అధ్యక్షులు జి సంజీవ, ఉపాధ్యక్షులు వి సంజీవ రెడ్డి, ఆర్ కుమార్, ప్రధాన కార్యదర్శి మోహన్ ఎలబోయిన, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ డి మాధవి లత, కార్యదర్శులు బి యాదగిరి, సి శ్రీనివాస్, టి రత్నాకర్ , కోశాధికారి టి రమేష్ ఇతరులు శ్రీ హరి ఫిజిక్స్ విభాగంలో చేసిన సేవల గురించి కొనియాడారు.