సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో గల మిర్యాలగూడ అడ్డరోడ్డు సెంటర్ నుండి పాత బస్టాండ్ వరకు గిరిజన బిడ్డ డాక్టర్ ధరావతు ప్రీతి మృతికి నిరసనగా వివిధ లంబాడా,గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు.
ఈ సందర్భంగా లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు వెంకట్రామ్,ధరావత్ నవీన్ నాయక్, గిరిజన హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు నగేష్ రాథోడ్, ప్రముఖ డాక్టర్ వెంకటాద్రి నాయక్,నాగు నాయక్,సైదులు నాయక్,వీటి నాయక్ తదితరులు మాట్లాడుతూ ఉన్నత ఆశయాలతో డాక్టర్ వృత్తిని చేపట్టి,ఉన్నత ప్రమాణాలతో అత్యంత నిరుపేదలకు వైద్య సేవలను అందించాలనే ఉద్దేశంతో వైద్య వృత్తిని చేపట్టిన గిరిజన బిడ్డ డాక్టర్ ధరావత్ ప్రీతి నాయక్ ను సీనియర్ వైద్య విద్యార్థి సైకో సైఫ్ చేత ర్యాగింగ్ భూతానికి గురై శారీరక,మానసిక చిత్రహింసలకు గురై చివరకు మత్తు ఇంజక్షన్ తీసుకొని చనిపోవడం యావత్ గిరిజన సమాజం దిగ్బ్రాంతికి గురైందని అన్నారు
ఈ సందర్భంగా గిరిజన నాయకులు పలు డిమాండ్లు చేస్తూ డాక్టర్ ప్రీతి ని చనిపోయేలా చేసిన సీనియర్ విద్యార్థి సైకో సైప్ ను వెంటనే ఎన్కౌంటర్ చేయాలని, కెఎంసి ప్రిన్సిపాల్,మిగతా వారిని కూడా విధుల నుండి తొలగించాలని,డాక్టర్ ధరావత్ ప్రీతి నాయక్ కుటుంబానికి ఆర్థిక భరోసాను కల్పించాలని,వారి కుటుంబంలో ఒకరికి గ్రూప్ 1స్థాయి ఉద్యోగాన్ని ఇవ్వాలని అన్నారు.ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా అధికారులు జాగ్రత్త పడాలని ఈ సందర్భంగా లంబాడ,గిరిజన నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ కౌన్సిలర్ రాజా,రవి,జెఎం.చిన్నా,బాలాజీ, వెంకట్రాం,డాక్టర్ వెంకటేశ్వర్లు,జిలేంద్రుడు, గోపి,శ్రీను,నగేష్,బాబా,నాగేశ్వరావు,బాబు, లాలు,రవీందర్,నాగు,రవీందర్,రైన్ బో నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్