క్యాన్సర్ అవగాహన కార్యక్రమం లో భాగం గా సిబిఐటి కళాశాల విద్యార్థులు, సిబ్బంది కాన్సర్ నివారణ, గుర్తింపు చికిత్సను ప్రోత్సహించడానికి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఒక చేతి ముద్ర ఒక క్యాన్సర్ రోగి కోసం ఒక ప్రార్థనతో సమానం అనే కార్యక్రమం చేపట్టారు. వివిధ రంగుల తో తమ చేతి తో ఒక రంగుల ముద్ర ని గోడ పైన ముద్రించారు. సిబిఐటి ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రవీందర్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు ప్రపంచ క్యాన్సర్ డిక్లరేషన్పై అవగాహన పెంచడానికి, లక్ష్యాలకు మద్దతుగా చెట్ల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాన్ని సీబీఐటీకి చెందిన చైతన్య స్వాస్థ్య వెల్నెస్ క్లబ్, చైతన్య పరివృత సీబీఐటీ పర్యావరణ క్లబ్, గ్రీన్ ఆడిట్ కమిటీ నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె. జగన్నాధ రావు, డా. పి.వి. నాగ ప్రపూర్ణ, మహేశ్వర్ రెడ్డి, డాక్టర్ ప్రసన్న రాణి ఆర్, డాక్టర్ జిఎన్ ఆర్ ప్రసాద్ పాల్గొన్నారు.
1 comment
WOW !!!