కాప్రా డివిజన్ పరిధిలోని కె.సి.ఆర్. (మల్లికార్జున) నగర్ కాలనీ అధ్యక్షులుగా దొమ్మాటి కిరణ్ కుమార్ రావు, ఉపాధ్యక్షులుగా షేక్ కసీం, వాసంశెట్టి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా ఒంటెద్దు లింగస్వామి, కోశాధికారిగా ఎన్. రాజు లను కాలనీవాసులు ఆదివారం నాడు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు దొమ్మటి కిరణ్ కుమార్ రావు మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో కాలనీ అధ్యక్షుడుగా మూడవసారి ఎన్నుకున్నందుకు కాలనీ అభివృద్ధి కి నిరంతర కృషి చేస్తానని అన్నారు. ఎన్నికైన వారిలో సంయుక్త కార్యదర్శులుగా అంకోజు ప్రవీణ్ చారి, చాగంటి బోసాయా, గుండు శ్రీనివాస్, సిరిపక శ్యామ్, ప్రచార కార్యదర్శులుగా మెరుగు మహేష్, షేక్ బాషా, గౌరవ అధ్యక్షులుగా వాసంశెట్టి రాంబాబు, సిరిపాక మల్లేష్, సలహాదారులుగా మహమ్మద్ అఫ్జల్, గడిపే రవి, బొజ్జ వెంకటేష్, నదునూరి ప్రభాకర్,మామిడి పెళ్లి రాంబాబు,లు ఎన్నికయ్యారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా