31.7 C
Hyderabad
May 7, 2024 02: 21 AM
Slider ప్రత్యేకం

ఆలయానికి నంది వాహనం బహుకరించిన మంత్రి ఆర్కే రోజా

#roja

చిత్తూరు జిల్లా నగరి పట్టణ పరిధిలోని కామాక్షి సమేత కరకంటేశ్వరాలయానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల, క్రీడాశాఖ మంత్రి ఆర్కేరోజా మహాశివరాత్రి ని పురస్కరించుకొని నందివాహనాన్ని వితరణగా అందించారు. గురువారం ఆలయానికి విచ్చేసిన ఆమె రూ. 1.80 లక్షల మతింపు గల నందివాహనాన్ని ఆలయానికి అందించారు.

ఈ సందర్భంగా నంది వాహనానికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అర్చనలు చేసి ధూప, ధీప నైవేద్యాలు సమర్పించారు. భక్తి శ్రద్దలతో మంత్రి నంది వాహనానికి పూజలు చేయగా అర్చకులు ఆమెను పుష్పాలతో ఆశీర్వదించారు. శివాలయంలో నంది వాహనం ప్రసిద్ధి చెందిందని ఆ వాహన సేవలు ఇకపై కరకంఠేశ్వరునికి అందుతుందని, భక్తులకు ఆలయంలో నందిసేవలో పాల్గొనే భాగ్యం కలుగుతందని ఆలయ ధర్మకర్త సుబ్రమణ్యం తెలిపారు. ఆలయ కమిటీ తరపున దుస్సాలువలతో ఆమెను సత్కరించారు.

Related posts

విద్యుత్ చార్జీల పెంపును ఉపసంహరించుకోండి

Sub Editor 2

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దివ్యాంగులు ర్యాలీ

Satyam NEWS

సీఎం జగన్  ప‌ర్య‌ట‌న‌ ఏర్పాట్ల‌ ప‌రిశీల‌న‌…!

Satyam NEWS

Leave a Comment