ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్రవేశ పరీక్షలో ఫిజికల్ సైన్స్ విభాగంలో 5వ ర్యాంక్ సాధించిన హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని 3వవార్డు ఎన్జీవోస్ కాలనీకి చెందిన సాయి కృష్ణ కిషోర్ ని స్థానిక కౌన్సిలర్ సన్మానించారు. మూడో వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి సాయి కృష్ణ కిషోర్ ని ఘనంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మూడో వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో సాయి కృష్ణ కిషోర్ ఉత్తమ ప్రతిభ కనపరచడం తమకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. భవిష్యత్తులో కిషోర్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కిషోర్ తల్లిదండ్రులు చక్రపాణి శ్రీనివాస్ అన్నపూర్ణ లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సాయి కృష్ణ కిషోర్ తల్లిదండ్రులు చక్రపాణి శ్రీనివాస్ అన్నపూర్ణ, సన్నిహితులు నాగరాజు,శశి సాయి,అంజి తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్