29.7 C
Hyderabad
May 2, 2024 06: 52 AM
Slider ఆదిలాబాద్

ఆదిలాబాద్ జిల్లాలో క్షుద్ర పూజల కలకలం

#phc

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ద్వారం ముందు ఆదివారం  క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు స్థానికులను ఆందోళనకు గురి చేశాయి. పి.హెచ్.సి గేటు ఎదుట ఓ గుడ్డు, రెండు నిమ్మకాయలపై పసుపు కుంకుమ చల్లి  ఉండటాన్ని చూసిన స్థానికుల్లో  చర్చనీయాంశంగా మారింది. గతంలో మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ఎదుట సైతం  ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం స్థానికులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తాజాగా పి.హెచ్.సి ఎదుట పూజా సామగ్రి, నిమ్మకాయలు గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లిన ఘటన చోటుచేసుకోవడం  దుమారం రేపుతోంది.

Related posts

తల్లిదండ్రుల గురువుల ఆశయాన్ని నిలబెట్టే బాధ్యత మీదే

Satyam NEWS

సాగర్ జీ వస్తున్నారని సత్యంన్యూస్ ఏనాడో చెప్పింది

Satyam NEWS

మాతా నీకివే…

Satyam NEWS

Leave a Comment