ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ద్వారం ముందు ఆదివారం క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు స్థానికులను ఆందోళనకు గురి చేశాయి. పి.హెచ్.సి గేటు ఎదుట ఓ గుడ్డు, రెండు నిమ్మకాయలపై పసుపు కుంకుమ చల్లి ఉండటాన్ని చూసిన స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ఎదుట సైతం ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం స్థానికులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తాజాగా పి.హెచ్.సి ఎదుట పూజా సామగ్రి, నిమ్మకాయలు గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లిన ఘటన చోటుచేసుకోవడం దుమారం రేపుతోంది.
previous post