ఉపాధిహామీ పథకం కింద మంజూరైన నిధులతో ములుగు జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. జంగలపల్లి కోసం ఉపాధి హామీ నిధులు 70 లక్షల రూపాయలు మంజూరు కాగా జంగాలపల్లి క్రాస్ రోడ్ లో సీసీ రోడ్లు వేస్తున్నారు. నేడు ఈ పనులను సర్పంచ్ అనిత రాణి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ములుగు మాజీ ఎంపీపీ వినయ్ కుమార్, ఉప సర్పంచ్ గుండ కళ, PACS ఛైర్మెన్ రాములు, ఇంచెర్ల MPTC శ్రీను, వార్డ్ మెంబర్ జ్యోతి, మాజీ సర్పంచ్ శ్రీధర్, గుండా మొగిలి, మేకల మొగిలి, నాగపూరి ఆనంద్, బూరం చేరాలు, మోహన్ రెడ్డి, బంజరుపళ్లి కంకణాల రఘుపతి , బంజరుపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు తప్పట్ల గణపతి, గ్రామ తెరాసా నాయకులు పాల్గొన్నారు.