విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాల్లో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాజశ్యామల మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాజ శ్యామల యాగం విశిష్టతను స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి సీఎం జగన్ కు తెలియజేశారు పీఠంలో సుమారు గంటసేపు సీఎం గడిపారు
అనంతరం జగన్ పీఠం లోనే అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. పీఠంలో నిర్వహించే కార్యక్రమాల గురించి సీఎం జగన్ కు శారదా పీఠాధిపతి వివరించారు
ఈ కార్యక్రమంలో సీఎం విశాఖ శ్రీ శారదాపీఠం వెబ్ సైట్ ను ఆవిష్కరించారు. పండితులకు సీఎం జగన్ చేతుల మీదుగా సత్కారం జరిగింది.