42.2 C
Hyderabad
May 3, 2024 17: 49 PM
Slider గుంటూరు

గొట్టిపాళ్లలో టీడీపీ కార్యకర్తలపై దాడులను ఖండించిన చంద్రబాబు

#TDP

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గొట్టిపాళ్ల గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై విచక్షణా రహితంగా, మారుణాయుధాలతో జరిగిన దాడిని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం మాచర్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై జిల్లా నేతలను అడిగి సమాచారం తెలుసుకున్నారు.

దాడుల్లో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు సూచించారు. గ్రామంలో వైసీపీ గూండాలు ఇళ్లపై పడి గంటల తరబడి మారణహోమం సృష్టిస్తుంటే నివారించలేక పోవడం పోలీసుల వైఫల్యం కాదా అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.

పల్లెల్లో హింసా రాజకీయాలు చేస్తున్న వైసీపీ నేతలకు పోలీసుల మద్దతే ఈ తరహా ఘటనలకు కారణం అని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

Related posts

కేసీఆర్ కుటుంబం, చెంచాల కోసమే ధరణి: ఈటల రాజేందర్

Satyam NEWS

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తరలించరాదని భాజపా నిరసన

Satyam NEWS

ఒకరికి తెలియకుండా మరొకరు.. మొత్తం ఆరుగురు

Satyam NEWS

Leave a Comment