తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబునాయుడి పర్యటన సందర్భంగా విశాఖ ఎయిర్ పోర్టు లో టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. నాలుగు గంటలుగా ఆయన ఎయిర్ పోర్టు నుంచి బయటకు వెళ్లకుండా నిరోధిస్తున్న వైసిపి నాయకులు చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ నినాదాలు చేస్తున్నారు.
దాంతో ఎయిర్ పోర్టు ముందు చంద్రబాబునాయుడు బైఠాయించారు. చంద్రబాబు తో బాటు ఈ నిరసన దీక్షలో నిమ్మకాయల చినరాజప్ప, అచ్చయ్యనాయుడు, అనిత, వెలగపూడి, వాసుపల్లి, పల్లా శ్రీనువాసురావు తదితరులు ఉన్నారు.