తమ ఉద్యోగాలకు భద్రత ఇవ్వండి సీఎం గారూ.. అంటూ సమగ్ర శిక్ష ఉద్యోగులు కోరుతున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన నిరాహార దీక్షలు 8 వ రోజులో భాగంగా నేడు కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు చాయ్ అమ్ముతూ నిరసన తెలిపారు. ఈ సందర్బంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. తాము పరిష్కారం చూపలేని కోరికలు కోరడం లేదన్నారు. తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని కోరుతున్నట్టు వెల్లడించారు. ప్రతి నిత్యం విద్యార్థుల క్షేమాన్ని కోరుకునే తమను పట్టించుకోకపోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తమను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలని, భద్రత లేని ఉద్యోగాలు తమకు వద్దని తెలిపారు. రీ ఎంగేజ్ పేరుతో తమ బతుకులు అంధకారం అవుతున్నాయన్నారు. ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు
previous post
next post